101 పరుగులకే చాప చుట్టేసిన టీం ఇండియా

 

ఆస్ట్రేలియాలో ఇరగదీసిన టీం ఇండియా, శ్రీలంకతో టి20 మ్యాచ్ లో ఒక్కసారిగా పిల్లిలా మారిపోయింది. పుణెలో జరుగుతున్న మొదటి టి20 లో, అనుభవం లేని శ్రీలంక కుర్ర బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు భారత బ్యాట్స్ మెన్. కేవలం అశ్విన్ మాత్రమే 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతని స్కోర్ తప్పితే, మిగిలిన భారత బ్యాట్స్ మెన్ స్కోర్లు మొబైల్ నెంబర్ ను తలపించాయి.

పిచ్ పై పచ్చికను ఎక్కువగా ఉంచి పేసర్లకు స్వర్గధామంలా డిజైన్ చేయడంతో, శ్రీలంక స్వింగ్ బౌలింగ్ ను అడ్డుకుని బ్యాట్స్ మెన్ నిలబడలేకపోయారు. కేవలం 101 పరుగులకే ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. శ్రీలంక బౌలర్లలో రజిత, శానక చెరో మూడు వికెట్లు, చమీర రెండు, సేననాయకే ఒక వికెట్ తీశారు. మరి భారత బౌలర్లు పిచ్ ను ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి..