ఉగ్ర కలకలం..ఉలిక్కిపడిన హైదరాబాద్
posted on Jun 29, 2016 10:48AM
దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు మన భాగ్యనగరంలోనే దొరుకుతున్నాయి. ముష్కరులకు హైదరాబాద్ సేఫ్ జోన్గా మారిపోవడంతో చాలా మంది ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజాగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఒక గ్రూప్గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కుట్రను ఎన్ఐఏ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్లోని పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని..వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ నుంచి ఎన్ఐఏ బృందం హైదరాబాద్కు చేరుకుంది. స్థానిక పోలీసుల సాయంతో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేపట్టి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు