హరికృష్ణను దూరంగా పెడుతున్నారా!

 

 

 

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన మధ్య అంతరం పెరిగినట్లే కనిపిస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేశాననే తనని దూరంగా వుంచుతున్నట్లు అనుమానంగా ఉందని అన్నారు. పార్టీలో జరిగే కార్యక్రమాలన్ని మీడియాలో చూసి తెలుసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. ఈ రోజు జరిగిన పార్టీ విస్తృతాస్థాయి సమావేశానికి తనను ఆహ్వానించలేదని అన్నారు. అసలు తాను పార్టీలో ఉన్నానో, లేనో తెలియని అయోమాయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై హరికృష్ణ అసంతృప్తిగా ఉన్నారు.