విశాఖలో మరో అగ్నిప్రమాదం

విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హార్బర్‌లో ఓ బోటు చేపల వేటకు వెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి పోర్టు అధికారులకు మత్స్యకారులు సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో రూ. 50 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.