ఫిల్మ్ ఇండస్ట్రీ కేర్ ఆఫ్ బీజేపీ

 

తెలుగు సినిమా మొత్తం నమో జపం చేస్తోంది. బీజేపీ పిలుస్తోంది రా కదలి రా.. అని ఒకరి వెంట ఒకరు కమలనాధుల చెంతకు చేరుతున్నారు. సర్వేలన్నీ ఇంచుమించు ఎన్డీయే వైపు మొగ్గు చూపుతుండటంతో టాలీవుడ్ బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. తెలుగు సినీ ప్రముఖులు ఫిలింనగర్ టు గాంధీనగర్ టికెట్లు బుక్ చేసుకుంటారు. నమో ఆశీస్సులు తీసుకుని వస్తున్నారు. మరికొందరు నటులు రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళ్లి కాషాయ కండువాలు కప్పుకుని వస్తున్నారు.

 

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నటులు కీలకంగా వ్యవహరించేవారు. ప్రస్తుతం కమలనాధులకు మద్దతు ప్రకటిస్తున్నారు. కృష్ణంరాజు, జీవిత రాజశేఖర్, సురేష్ వంటి నటులు పార్టీలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ , నాగార్జున, మంచు లక్ష్మి నరెంద్రమోడీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ అగ్రనేత వెంకయ్య మాటల ప్రకారం మరికొంతమంది సినీ ప్రముఖులు భారతీయ జనత పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.