రైతు రుణమాఫీలో తప్పేంలేదు.. హైకోర్టు

 

రైతు రుణమాఫీ అనేది సరైన విధానం కాదని అంటూ దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. మనకు అన్నం పెడుతున్న వారి రుణాలను మాఫీ చేస్తే తప్పేంటని పిటిషనర్ని హైకోర్టు ప్రశ్నించింది. రైతులు లేకపోతే మనం ఎవ్వరం లేమని అంటూ, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇకముందు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని హెచ్చరించింది.రుణమాఫీ కాకపోవటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ఎందుకు రుణమాఫీ చేయకూడదని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ సమగ్రంగా లేదని, సంపూర్ణ వివరాలతో మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. రైతులు, చేనేత కార్మికులు, తాపీ పనివారిని ఆదుకోవాల్సిన అవసరం వుందని హైకోర్టు అభిప్రాయపడింది.