భార్యభర్తలు ఒకరిపై ఒకరు 67 కేసులు పెట్టుకున్నారు..!!

 

భార్యభర్తలు జీవితాంతం కలిసి మెలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.. కానీ ఒక జంట మాత్రం ఒకరిమీద ఒకరు ఏకంగా 67 కేసులు పెట్టుకున్నారు.. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు 2002లో అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది.. పెళ్లి తర్వాత వీరిద్దరూ అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.. అయితే ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో సదరు భార్య అమెరికా నుంచి వచ్చి బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.. ఇక అప్పటి నుంచి వీరు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒకరిపై ఒకరు కేసుల మీద కేసులు పెట్టుకుంటున్నారు.. సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన భార్యపై 58 కేసులు పెట్టగా, భార్య కూడా తన భర్తపై 9 కేసులు పెట్టింది.. తాజాగా వీరి కేసులు సుప్రీంకోర్టుకు చేరాయి.. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. పెండింగ్‌లో ఉన్న కేసులు పూర్తయ్యేదాకా భార్యాభర్తలు గానీ, వారి కుటుంబసభ్యులు గానీ ఎలాంటి కొత్త కేసులు పెట్టకూడదని కోర్టు ఆదేశించింది.. అంతేగాక, ఆరు నెలల్లోపు పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని బెంగళూరు న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది.