ఇడుపులపాయలో ఏపీ రాజధాని...

పోలవరం, అమరావతి లను సినిమాలతో పోలుస్తూ జగన్, చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలకు తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.. ఈ వ్యాఖ్యల పట్ల యనమల, జగన్ మీద మండిపడ్డ సంగతి తెలిసిందే.. తాజాగా ఇదే విషయం మీద మంత్రి దేవినేని ఉమా కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.. పోలవరం ప్రాజెక్ట్ సైట్లో రోజూ 9 వేల మంది పనిచేస్తున్నారని, అసలు పోలవరంను సినిమా అనడానికి జగన్ కి నోరెలా వచ్చిందని మండిపడ్డారు.. ఏపీ రాజధానిని జగన్ ఇడుపులపాయలో కట్టాలనుకున్నారని, అందుకే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతిని, భ్రమరావతని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.