హిజబుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

 

దేశ రాజధాని ఢిల్లీ లో భారీ పేలుడుకు కుట్రపన్నిన హిజబుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ ఉత్తర ప్రదేశ్ నివాసి లియాకత్ ఆలీని రెండు రోజుల క్రితం గోరఖ్ పూర్ లో అరెస్ట్ చేశారు.  పోలీసుల ఇంటరాగేషన్ లో ఆసక్తికరమైన అంశాలు లియాకత్ ఆలీ వెల్లడించాడు. హోలీ సందర్భంగా ఢిల్లీలో భారీ పేలుళ్ళకు తాను ఢిల్లీ బయలుదేరినట్లు చెప్పాడు. ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ఓల్డ్, జామా మసీద్ ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్ పై దాడి చేయగా ఎకె. 47 రైఫిలు, బాంబులు లభించాయి. రైఫిలు బాంబులు లభించిన రూమ్ ను సీల్ చేసి ఇద్దరు గెస్ట్ సిబ్బందిని ఇంటరాగేషన్ కోసం అదుపులోకి తీసుకున్నారు. గురువారం లియాఖత్ ఆలీని కోర్టులో హాజరు పరచగా పదిహేను రోజుల కస్టడీని విధించింది.