ఢిల్లీలో హైఅలర్ట్.. నిఘా వర్గాల హెచ్చరిక...

 

దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని... ఉగ్రవాదులు భారీ దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  20-21 మంది లష్కర్‌ టెర్రరిస్టులు దేశంలో ఇప్పటికే చొరబడినట్టు  ఇంటిలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, పంజాబ్‌ లో  టెర్రర్‌ గ్రూపులు దాడిచేయవచ్చనే  అనుమానాలను  నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అనుమానిత వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు  ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తన జిల్లా, మెట్రో పోలీస్, రైల్వే పోలీసు విభాగాలతో పాటు పలు ప్రాంతాల్లో నిఘా గట్టిగా  ఏర్పాటు చేయాలని హెచ్చరించింది.