చనిపోయింది.. బతికింది.. మళ్ళీ అంతలోనే...

 

ఫిలిప్పీన్స్‌లో ఒక విచిత్రకరమైన, విషాదకరమైన సంఘటన జరిగింది. విష జ్వరం కారణంగా మరణించిన మూడేళ్ళ బాలికకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వుండగా, బాలిక శవాన్ని శవపేటికలో పెట్టే సమయంలో పాపలో కదలికలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన అందరూ పాపని ఆస్పత్రికి తీసుకువెళ్ళడంతో బతికింది. చనిపోయిందని అనుకున్న తమ పాప బతకడంతో ఆ తల్లిందండ్రులు ఎంతో సంతోషించారు. చుట్టుపక్కల ప్రాంతాల జనం కూడా చనిపోయి బతికిన పాపని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. అయితే కూతురు తిరిగి బతికిన ఆనందం ఆ తల్లిదండ్రులకు రెండు రోజులు కూడా మిగల్లేదు. ఆ పాప మళ్ళీ కోమాలోకి వెళ్ళి మరణించింది. గతంలో మాదిరిగా తమ పాప తిరిగి లేస్తుందేమోనని ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దాంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ ఆ పాపకి అంత్యక్రియలు నిర్వహించారు.