రైతుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వ హత్యలే

 

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీటీడీపీ నాయకులు తెలంగాణలో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఎర్రబెల్లి ఆదివారం నాడు కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ లైన్లు వేసే కాంట్రాక్ట్ తన బంధువుకు రాలేదన్న అక్కసుతోనే కేసీఆర్ ఈ విద్యుత్ లైన్ నిర్మాణ నిర్ణయాన్ని మార్చుకున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. అయితే అసలు విషయాన్ని మరుగున పెట్టేసి నక్సల్స్ సమస్య వల్లనే కరెంటు లైన్లు వేయడం లేదని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు.