రాష్ట్రపతికి కిరణ్ మరో లేఖ

 

 

 

తెలంగాణ బిల్లుపై సమగ్రాభిప్రాయం తెలుసుకునేందుకు 4 వారాలపాటు గడువును తప్పనిసరిగా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మరో లేఖ రాశారు. తాను మొదట రాసిన లేఖలో 5000 పైచిలుకు సవరణలు ప్రతిపాదించినట్లు గుర్తించామని, ముసాయిదా బిల్లుపై మొత్తం 9000 పైచిలుకు సవరణలను క్లాజుల వారీగా సభ్యులు ప్రతిపాదించారని రాష్ట్రపతికి రాసిన రెండో లేఖలో కిరణ్ వివరించారు. వీటన్నింటిపైనా సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు ఓటింగ్ నిర్వహించేందుకు వీలుగా నాలుగు వారాల గడువు అవసరమని మరోసారి విజ్ఞప్తి చేశారు.