చంద్రబాబు ప్రసంగం...సీపీఐ నేత కంటతడి..

 

ఇటీవల ఏపీ అసెంబ్లీలో కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు బావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రసంగానికి మరో నేత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈసారి కంటతడి పెట్టుకున్నది టీడీపీ నేత కాదు...సీపీఐ నేత. శాసన మండలిలో ఈ రోజు ప్రంసంగించిన చంద్రబాబు కేంద్రం ఏపీకి ఎలా అన్యాయం చేసిందో పూస గుచ్చినట్టు వివరించారు. కేంద్రం చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు..? ఎప్పుడెప్పుడు ఏవేం మాట్లాడారు...? అన్న విషయాలు చంద్రబాబు చెప్పారు. ఇక చంద్రబాబు చెబుతున్న సమయంలో శాసనమండలి సభ్యుడు సీపీఎం శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం కంటతడి పెట్టారు. సీఎం పలు అంశాలపై మాట్లాడుతుండగా బాలసుబ్రహ్మణ్యం ఉద్వేగానికి లోనే కన్నీళ్లు ఆపుకోలేక అక్కడి నుండి పక్కకు వెళ్లారు. దీంతో మిగిలిన ఎమ్మెల్సీలు ఆయన దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పారు. మొత్తానికి ఏపీకి జరిగిన అన్యాయంపై పార్టీలకు అతీతంగా అందరూ ఎంతో బాధపడుతున్నారనడానికి ఇదే నిదర్శనం..