తన గురువులకు చంద్రబాబు సత్కారం

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు గుంటూరులో జరిగిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాల్యంలో తనకు పాఠాలు చెప్పిన గురువులు మునికృష్ణారెడ్డి, లక్ష్మణరెడ్డిలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి తన ఒక నెల పెన్షన్‌ని రాష్ట్ర అభివృద్ధికి విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చే బాధ్యత తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని, ఉపాధ్యాయులు విద్యార్థులలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యాపరంగా మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రణాళికలను వివరించారు.