రేవంత్ రెడ్డి మీద కేసు

 

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద బంజారాహిల్స్ పోలీసులు 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు మరికొంత మందికి ముడుపులు అందాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఓ న్యాయవాది నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దాంతో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.