లాక్ డౌన్ ముగిసే వరకూ తెలంగాణ లో బీ జె పీ ఫీడ్ ద నీడ్

లాక్ డౌన్ ముగిసే వరకు బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అన్నదానం, సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయాలతో పాటు ప్రతి కార్యకర్త ఇంటి పై పార్టీ జెండా ఎగరేయ్యాలని, బీజేపీ కార్యకర్తలు -డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దిన్ దయల్ ఉపాధ్యాయ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ ఎదుర్కొంటున్న ప్రజలకు సంఘీభావంగా బీజేపీ కార్యకర్తలు ఒక్క పూట భోజనం మానేయాలని, ఫీడ్ ది నీడ్ లో ప్రతి  కార్యకర్త 5 + 1 పేదలకు అన్నదానం చెయ్యాలని ఆయన కోరారు. లాక్ డౌన్ లో అత్యవసర సేవలు అందిస్తున్న వారికి కార్యకర్తలు మీ ఏరియాలో ఉన్న 40 మందితో సంతకాలు సేకరించి థాంక్యూ లెటర్స్ ని ఉద్యోగులకు ( కరోనా వారియర్స్ ) పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పరిశ్యుద్ధ కార్మికులకు అందించాలని సూచించారు. ప్రతి కార్యకర్త మాస్కులను ఇంట్లో తయారు చేపించి మరో ఇద్దరికి అందించేలా వ్యవస్థ ను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలు సామాజిక దూరం పాటిస్తూ ,ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.