బీహార్ లో 20మంది చిన్నారులు మృతి

 

బీహార్‌లోని శరణ్ జిల్లా మష్రాఖ్ బ్లాక్ గందావన్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆరగించిన 20మంది విద్యార్థులు మరణించారు. మరో 21 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 22ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడినప్పటికీ తీవ్ర అస్వస్థతో ఉన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాధిత విద్యార్ధులను సమీపంలో ఉన్న చాప్రా సదర్ ఆస్పత్రికి తరలిస్తుండగానే పదకొండు మంది దారిలోనే మరణించిగా మరి కొందరు ఆసుపత్రిలో మరణించారు. నిన్నమధ్యాహ్నం విద్యార్ధులకు వడ్డించిన భోజనంలో క్రిమిసంహరక మందు ఆర్గానో పాస్పరస్ కలసి ఉండవచ్చని బీహార్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అమర్ జీత్ సిన్హా అనుమానిస్తున్నారు. బాధిత విధ్యార్ధులకు పాట్నామెడికల్ కాలేజీలో చికిత్సఅందిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. చనిపోయిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.