ఢిల్లీకి లింక్తో 70 మందికి పాజిటివ్! ఏపిలో 87 పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు!
posted on Apr 1, 2020 5:58PM
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధికులకే 70 పాజిటివ్ కేస్ లు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి 1085 ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో 585 మందికి టెస్ట్ లు చేసాం. రెండు రోజులుగా కేసులు పెరిగాయని సి.ఎం. తెలిపారు.
వాలంటీర్లు, ఎ ఎన్ ఎమ్, ఆశ వర్కర్స్ ఇప్పటికే ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య భద్రతపై సర్వే చేస్తున్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నాం. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రయివేట్ డాక్టర్స్,నర్స్ లు ముందుకు రావాలని సి.ఎం. పిలుపునిచ్చారు.
కరోనా విపత్తు నేపద్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం పడింది. ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రశంసనీయం. రైతు కూలీలు,రైతన్నలు, ఆక్వ రంగంలో ఉన్న కూలీలు ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనులు చేసుకోవచ్చు. సామాజిక దూరం పాటిస్తూ రైతులు పనులు చేసుకోవచ్చు. కరోనా వచ్చిన వారిపై వివక్ష ప్రదర్శించరాదని సి.ఎం. సూచించారు.