సీఎం స్థానంలో లోకేష్

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జగన్‌ తో టీఆర్ఎస్ నేతల భేటీ, ఈనెల 19న కోల్‌కతా టూర్‌పై చర్చలు జరిపారు. రేపు చంద్రబాబు కోల్‌కతా వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. పార్టీ నేతల సూచనతో పర్యటన రద్దు చేసుకున్నారు. ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. ఈ భేటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కల్వా శ్రీనివాసులు, జవహర్, గంటా శ్రీనివాసరావు, నారాయణ, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి లోకేష్‌ దావోస్‌ పర్యటన ఖరారైంది. దావోస్‌లో సీఎం హాజరయ్యే సమావేశాల్లో లోకేష్‌ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.