గుడివాడలో అక్కినేని విగ్రహం

 

కృష్ణాజిల్లా గుడివాడలో ఉన్న ఏఎన్నార్ కళాశాలలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆయన కుమారుడు, సినీ కథానాయకుడు అక్కినేని నాగార్జున ఆవిష్కరించారు. అక్కినేని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రజల హ‌ృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన అక్కినేని నాగేశ్వరరావు పేరును మరింత అజరామరం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కినేని జాతీయ పురస్కారాలు అందిస్తున్నారు.