తొలి విడత అన్న క్యాంటిన్లు 35....

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయ తలపెట్టిన అన్న క్యాంటీన్లపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ మంగళవారం జరిగింది. తొలివిడతగా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మొత్తం 35 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అనంతపురంలో 5, తిరుపతిలో 5, గుంటూరులో 10, విశాఖపట్నంలో 15 చొప్పున అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు. అన్న క్యాంటిన్ల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలంటూ నాలుగు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.