మెదక్ జిల్లా ప్రమాదం: 12 మంది డిశ్చార్జ్

 

మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 12 మంది చిన్నారులను ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం వార్డులో దర్శన్‌, ఫాతిమా, నితూషాలు చికిత్స పొందుతున్నారని డాక్టర్లు వెల్లడించారు. శరద్‌ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, ప్రశాంత్‌, వరుణ్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.