సోనియా, రాహుల్ నేతృత్వంలో ర్యాలీ..

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ‘సేవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుండి.. పార్లమెంట్ వరకూ ఈ ర్యాలీ సాగుతుంది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే యత్నాలకు నిరసనగా కాంగ్రెస్ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది. అలాగే అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంగా మోడీ సర్కార్ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని ఇరికించే కుట్ర పన్నుతున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు.