ప్రియాంకకీ గాలమేశారు!

 

 

 

మహబూబ్‌నగర్ స్థానం నుంచి లోక్‌సభకు రాహుల్‌గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర మంత్రిణి డి.కె.అరుణ ఎంతో అభిమానంతో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుస్తున్న విషయమేమిటంటే, ఒకవేళ రాహుల్‌గాంధీ పోటీ చేయకపోతే, ప్రియాంకాగాంధీ చేతైనా పోటీ చేయించి, తద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అరుణ మేడమ్ భావిస్తున్నట్టున్నారు.

 

రాహుల్ లేదా ప్రియాంక ఎవరిచేతైనా పోటీ చేయించాలని దిగ్విజయ్‌సింగ్‌కి విన్నవించుకున్నారట. ఆయన నిందు మనసుతో స్పందించి సరే ఇద్దరి పేరుమీద సపరేట్ సపరేట్‌గా వినతిపత్రాలు సమర్పించండి నేను యువరాజుకి, యువరాణికి చెప్పి చూస్తానని అభయమిచ్చాడట. దాంతో జంట వినతి పత్రాలు సమర్పించి అరుణ గారు ఆనందంగా తిరిగొచ్చారట.



సమయానికి సలహా ఇచ్చేవారెవరూ మంత్రిణి గారి దగ్గర ఉన్నట్టు లేరు. లేకపోతే సోనియాగాంధీ పేరు మీద ఒక వినతిపత్రం, రాబర్ట్ వధేరా పేరు మీద మరో వినతిపత్రం సమర్పించి వస్తే ఓ పనయిపోయేది. ఆ వినతిపత్రాలు చూసి ఆ నలుగురిలో ఎవరో ఒకరు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పావనం చేసేవారు.