నటి పూజాగాంధీ కి షాక్
posted on May 9, 2013 10:20AM
ప్రముఖ కన్నడ నటి పూజాగాంధీ రాయచూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. గాలి జనార్ధన్ రెడ్డి సన్నిహితుడు శ్రీరాములు బీఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమెకు అతి తక్కువగా 1, 815 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ముంగారు మలే చిత్రంతో కన్నడ పరిశ్రమకు పరిచయమై అనతికాలంలోనే హీరోయిన్గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన పూజాగాంధీ మొదట మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ్ స్థాపించిన జేడీ(ఎస్) పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం ఆమె మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కర్నాటక జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆమె బీజేపీ మాజీ మంత్రి బి. శ్రీరాములు నేతృత్వంలోని బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ చేసి ఘోర పరాజయం పొందారు.