బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు

 

 

 

బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని సంతకం చేసిన ఫైళ్ళకు దిక్కులేదంటే దేశం ఎక్కడికేల్తోందని ఆయన ప్రశ్నించారు. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి ఫరేఖ్ చేసిన వ్యాఖ్యలపై ప్రదాని ఏమి సమాధానం చెబుతారని అన్నారు.

 

కాంగ్రెస్ కుట్రను జాతీయ స్థాయిలో బయటపెట్టేందుకే ఢిల్లీలో దీక్ష చేపట్టానని ఆయన తెలిపారు. దీక్షకు సహకరించిన వారందంకి కృతజ్ఞతలు తెలిపారు.  ఢిల్లీలో అంతా డీలర్లు, బ్రోకర్ల రాజ్యంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత మొత్తం పదిహేను లక్షల కోట్లా అవీనితి జరిగిందన్నారు.