పార్టీ నుంచి పోయేందుకు పాతికమంది రెడీ... బొత్స

 

 

 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్నంలో ఎంతగా దిగజారిపోయిందో జనం చెప్పుకోవడం సంగతి అటుంచితే సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు. పార్టీ నుంచి దాదాపు పాతికమంది ఎమ్మెల్యేలు జంప్‌జిలానీలు కానున్నారని పిసిసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ అంటున్నారు. అంతేకాదు... వీరిలో నలుగురు మంతుల్రు సైతం ఉన్నారట. దీనికి సంబంధించిన జాబితా ఒకటి తమ దగ్గర ఉందని ఆయన చెప్పారు. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడిన జెసి దివాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశామన్న బొత్స అవి ఆయన అందలేదంటున్నారన్న ప శ్నకు అందకపోతే మళ్లీ పంపుతాం అన్నారు. సాక్షాత్తూ తమ ప్రభుత్వం పైనే అవిశ్వాసం పెట్టిన స్వంత పార్టీ ఎంపీల పరిస్థితి గురించి అడిగిన పశ్న్రకు ఆయన స్పందిస్తూ వారి సంగతి అధిష్టానం చూసుకుంటుందన్నారు. కొంతమంది ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ పరోక్షంగా టీడీపీ, వైసీపీలని దుయ్యబట్టారు. బానేఉంది కానీ...మరి తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని అక్కడ సీట్లు సాధించడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించడం లేదా... సత్తిబాబూ... అని కొందరు కుశాగ్రబుద్ధులు ప్రశ్నిస్తున్నారు...