రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోలేదు!

 

 

 

కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ గరిక వంటిదని నెల్లూరుజిల్లా రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెసు పార్టీలో ఓ తప్పు జరిగినంత మాత్రాన అధిష్టానాన్ని తిట్టవద్దన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి పార్టీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన... పార్టీ అధ్యక్షురాలును తప్పు బట్టడం సరికాదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో పంథాలో వెళ్తుంటారన్నారు. ఏ పంథాలో వెళ్లినా సమైక్యం కోసం వారికి మద్దతిస్తామన్నారు. తాము కాంగ్రెసు పార్టీలో ఉంటూనే సమైక్యాంధ్ర కోసం పాటుపడుతామని చెప్పారు. తమ నినాదం సమైక్యవాదమేనని, తుది గెలుపు తమదేనని వివేకానంద పేర్కొన్నారు.