నాగార్జున సరసన నటించాలనేది అమ్మ కోరిక.. వెల్లడించిన సునీత కుమారుడు!
on Jul 4, 2022
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాట పాడిందంటే చెవుల్లో అమృతం పోసినంత హాయిగా ఉంటుంది. టాలీవుడ్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఈమెకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. తన అద్భుతమైన గాత్రంతో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో పాటలు పాడి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాను పాడిన ఎన్నో పాటలకు అవార్డులను కూడా అందుకున్నారు. కొన్ని టీవీ షోస్ లో సింగర్ గా, ఇంకొన్ని షోస్ కి జడ్జి గా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటూ మంచి ఫేమస్ అయ్యారు. ఐతే ఇటీవల అమ్మ మనసులోని మాటను ఆమె కుమారుడు ఆకాష్.. 'నిఖిల్ తో నాటకాలు' ఇంటర్వ్యూలో చెప్పాడు. "ఒక వేళ యాక్టింగ్ అంటే సునీత గారికి ఇష్టం ఉండి ఉంటే ఎవరి పక్కన చేసే అవకాశం వుంది?" అని ఆకాష్ ని యాంకర్ నిఖిల్ అడిగాడు.
"ఒకవేళ అమ్మకి యాక్టింగ్ ఛాన్స్ వస్తే హీరో నాగార్జున పక్కన చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఒక విషయం గురించి అమ్మకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు నాకు తెలిసింది.. నాగార్జున గారి పక్కన ఎవరు హీరోయిన్ గా చేసినా బాగా ఫేమస్ ఐపోతారు అని. డైరెక్ట్ గా ఈ విషయం అమ్మ నాతో చెప్పకపోయినా వాళ్ళ మాటల్ని బట్టి అమ్మకి ఒకవేళ ఛాన్స్ వస్తే నాగార్జున గారి పక్కన చేయడం ఇష్టం అని తెలిసింది." అంటూ చెప్పాడు ఆకాష్. కొడుకుతో పాటు సునీత కూడా పాల్గొన్న ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఫైనల్ టచ్ గా సునీత "అవును నిజం.. నువ్వంటే నాకిష్టం" పాట పాడితే ఆకాష్ పాటకు తగ్గట్టు గిటార్ ప్లే చేసి మెస్మరైజ్ చేశాడు.
Also Read