నిఖిల్ విగ్గు ఇచ్చాడు.. ఆమె రగ్గు ఇస్తుంది!
on Aug 3, 2022
ఇటీవల ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతర' ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు. ఇందులో మొత్తం ఆది, రాంప్రసాద్ మాత్రమే ఎక్కువగా కనిపించారు. ఆది వేసే పంచులకు కడుపుబ్బా నవ్వుకోక తప్పదు. సుధీర్ ప్లేస్ ని కొంతవరకు ఆది రీప్లేస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇపుడు ఏ షో చూసినా ఆది, రాంప్రసాద్ మాత్రమే కనిపిస్తున్నారు. ఆది, రాంప్రసాద్, ఇమ్మానుయేల్, పంచ్ ప్రసాద్, భాస్కర్ కలిసి స్కిట్ చేశారు. వైకుంఠపాళి ఆడుతూ పాడుతూ వేసే పంచులకు పొట్ట చెక్కలైపోవాల్సిందే అన్నట్టుగా పెర్ఫార్మ్ చేశారు.
సుయోధనుడిగా రాంప్రసాద్ నటించగా, దుశ్శాసనుడిగా ఇమ్మానుయేల్ అభినయించాడు. అందరూ కలిసి వైకుంఠపాళి ఆడారు. చివరిగా ఇమ్మానుయేల్ దుశ్శాసనుడి రూపంలో వచ్చి ద్రౌపది ఐన శాంతి స్వరూప్ ని చెరబట్టి చీర బదులు అతని విగ్గుని లాగేశాడు. శాంతి స్వరూప్ "హే కృష్ణా" అనే డైలాగ్ బదులు "హే నిఖిల్" అని అరుస్తూ ఏడ్చేడు.
వెంటనే సెట్ కి వచ్చిన 'కార్తికేయ '2 టీం నుంచి నిఖిల్ వెళ్లి శాంతిస్వరూప్ కి విగ్గు పెట్టాడు. అలా నిఖిల్ విగ్గు పెడుతుంటాడు, ఇమ్ము తీసేస్తుంటాడు. రాంప్రసాద్ నిఖిల్ కి విగ్గులు ఇస్తూ ఉంటాడు. ఇక ఫైనల్ గా విగ్గు లాగి లాగి అలుపొచ్చి ఇమ్ము అదే విగ్గు తన నెత్తిన పెట్టుకుని కూర్చుండిపోయాడు. ఇక ఆది లైన్ లోకి వచ్చి "మీరు శాంతికి విగ్గు ఇచ్చారు కదా తర్వాత తను మీకు రగ్గు ఇస్తది" అన్నాడు నిఖిల్ తో. అలా ఆ స్కిట్ ఎండ్ అవుతుంది.