ENGLISH | TELUGU  
Home  » TV News

ఆడిపాడే బొమ్మలమే కానీ.. స్టేజిపై ఏడ్చేసిన సునీత!

on Apr 24, 2021

 

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతోన్న షోలను బాగా ఎమోషనల్‌గా డిజైన్ చేస్తున్నారు. ఎమోషన్ ఎంతగా పండితే ఆడియన్స్ అంతగా షోకి కనెక్ట్ అయిపోతారు. అలా ఇప్పుడు డ్రామా జూనియర్స్ అనే షో ఎమోషన్‌ని బాగా పండిస్తోంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. 'సరిగమప' షో అయిపోవడంతో ఆ షో స్థానంలో డ్రామా జూనియర్స్ అనే కొత్త షోను మొదలుపెట్టారు. టాలెంట్ ఉన్న చిన్నపిల్లలను తీసుకొచ్చి షో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా సింగర్ సునీత, రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి సెల‌బ్రిటీల‌ను తీసుకొచ్చారు.

తాజాగా ఈ షోలో ఓ చిన్నారి వేసిన స్కిట్ చూసి చలించిపోయారు జడ్జిలు. సెలబ్రిటీలంటే అందరికీ వారిపై హక్కు ఉంటుందని ఫీల్ అవుతుంటారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్ లలో తారలపై రకరకాల రూమర్లు రాస్తుంటారు. ఇదే టాపిక్ తీసుకున్న చిన్నారి.. ఓ స్కిట్ వేసింది. అందులో ఆమె హీరోయిన్ కావాలని కలలు కని.. తన కలను నెరవేర్చుకుంటుంది. తండ్రి వద్దంటున్నా హీరోయిన్ అవుతుంది. అయితే మీడియా ఆమెపై రాసిన తప్పుడు వార్తల వలన తండ్రి విషం తాగి సూసైడ్ చేసుకుంటాడు.

ఈ స్కిట్ చూసిన సునీత తన ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. స్టేజ్ మీదకు వచ్చి.. ''చాలా కనెక్ట్ అయిపోయాను.. మీకు మేం సెలబ్రిటీలం అవ్వొచ్చు. మీరు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు.. సినిమాల్లో ఆడిపాడి బొమ్మలమే కానీ అమ్మలం రా..'' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత  రేణు దేశాయ్ కూడా ఏడ్చేసింది. దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దంటూ వేడుకుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.