2019లో కులూ మనాలి రూమ్లో రెజీనాకు ఎదురైన అనుభవం?
on Jul 6, 2022
ప్రతీ వారం 'ఆలీతో సరదాగా' షో ద్వారా ఆడియన్స్ కి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఇటీవల కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి, అర్చన జగదీశ్ ఇలా ఎంతో మంది తారలు వచ్చి ఆలీతో చిట్చాట్ చేసి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్టేజి మీదకు రెజీనా కసాండ్రా రాబోతోంది. ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యింది. 'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులు కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి గురించి అలీ అడిగినప్పుడు రెజీనా మాట్లాడుతూ, "ఈ వయస్సులో కూడా ఆయన చాలా త్వరగా విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. ఇది చాలా ప్రశంసనీయం." అని చెప్పింది.
ఇక రెజీనా స్కూల్లో అబ్బాయిలను బాగా కొట్టేదట. క్లాస్ లీడర్గా ఉంటే అబ్బాయిలను కొట్టేస్తారా? అని అలీ అడిగితే, ఆ అని ఆన్సర్ ఇచ్చి నవ్వేసింది రెజీనా. నా ఫిజిక్ను చూసి అందరూ నన్ను డామినేటింగ్ అనుకుంటారు అని కూడా చెప్పింది. "2019లో కులూమనాలిలో రూమ్ నెంబర్ తెలీదు కానీ ఒకటి జరిగింది" అని అలీ అనేసరికి "ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి నా లైఫ్లో" అని చెప్పుకొచ్చింది రెజీనా. అక్కడ ఏం జరిగిందో కొంత క్లూ ఇచ్చింది.
ఇక తనకు హారర్ జానర్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. తనకు నచ్చిన సబ్జెక్టు వస్తే మాత్రం ఎలా ఉండాలి, ఎలాంటి మానరిజమ్ ను ఆడియన్స్ కి చూపించాలి అని ఎప్పుడు తపన పడుతూ ఉంటానని చెప్పింది రెజీనా. "హోటల్ కి వెళ్ళినా, క్యారవాన్ లోకి వెళ్ళినా ముందు రెజీనా అక్కడ ఎలా ఉంది అని చూడకుండా, ముందు బాత్రూంలోకి వెళ్లి ఎలా వుంది అని చూసుకుంటారంట ఏంటి?" అని అలీ అడిగితే గట్టిగా నవ్వేసింది. రెజీనా నటించిన కొత్త వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్' ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ఫారమ్లో ప్రసారం అవుతోంది.