విలన్ గా పెడితే శ్రీఆంజనేయం మూవీ ప్లాప్ అవుతుంది అన్నా...కృష్ణవంశి వినలేదు
on Jun 7, 2025
టాలీవుడ్ నటుడు, ఫేమస్ కమెడియన్ కం క్యారక్టర్ ఆర్టిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. రకరకాల డైలాగ్స్ తో ఇండస్ట్రీలో పాపులర్ ఐన వ్యక్తి. ఆయన ఒక చిట్ చాట్ షోలో ఇండస్ట్రీలోని కొంతమంది గురించి చెప్పుకొచ్చారు. "ఇక్కడ ఈవివి గారి గురించి చెప్పాలి. "ఆ ఒక్కటి అడక్కు" మూవీకి ఆడిషన్స్ టైములో ఆయన అద్దెకుండే ఇంటి దగ్గర మెట్లు ఉంటాయి. అక్కడ పెద్ద లైన్ ఉంది. ఫొటోస్ పట్టుకుని చాలా మంది వచ్చారు. నేను రేషన్ కార్డు టైపులో ఉండే ఫొటోస్ పట్టుకెళ్ళాను. అవి చూసి నన్ను ఏ ఊరూరా అని అడిగారు. తాడేపల్లి గూడెం అని చెప్పేసరికి ఐతే మా ఊరి పక్కనేనా అని సరే నువ్వు వెళ్లి ఏవిఎం దగ్గర ఉండు అన్నారు.
ఏవిఎం అంటే ఎక్కడ సర్ అన్నా. నువ్వు అక్కడ కూర్చోరా..నేను స్నానం చేసి వస్తా. కార్ వస్తుంది వెళదాం అని నన్ను స్టూడియోకి తీసుకెళ్లారు. ఆయన ఎంతో మంచి మనసు ఉన్న వ్యక్తి. రావు గోపాల్ రావు గారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేయగానే వీడు నా మేనల్లుడి క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయాడు అనగానే ఆ రోల్ నాకు ఇచ్చారు. ఆయన క్యారెక్టర్స్ ఇవ్వడమే కాదు గొప్ప మానవతా వాడి, ఫామిలీ మ్యాన్ ఆయన. ఇక కృష్ణ వంశి గారి గురించి చెప్పాలంటే ఆయనకు ఒక ఊత పదం ఉంటుంది. నువ్వెంట్రా ఇక్కడ అంటారు. ఆయన సినిమాకు ఆయన డేట్లు ఇస్తారు తర్వాత ఎక్కడైనా కనిపిస్తే నువ్వెంట్రా ఇక్కడ అంటారు. అప్పుడు సర్ మీ సినిమాలో నాకు డేట్ లు ఇచ్చారు అని చెప్తాను. అలా నేను సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం నాకు మంచి పేరు తెచ్చిన మూవీస్. ఆ తర్వాత శ్రీఆంజనేయం మూవీలో విలన్ రోల్ ఇచ్చారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న నన్ను శ్రీఆంజనేయం మూవీలో విలన్ గా పెడితే సినిమా ప్లాప్ అవుతుంది అన్నా కూడా ఆయన వినలేదు. వేరియేషన్ కావాలి అంటే నేనే కరెక్ట్ అని నాకు అవకాశం ఇచ్చారు. అలా శ్రీఆంజనేయం మూవీలో మాంత్రికుడి రోల్ ప్లే చేసాను." అని చెప్పారు పృద్వి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
