సందడిగా పల్లవి సీమంతం వేడుక!
on Aug 12, 2022
'పాపే మా జీవన జ్యోతి' సీరియల్ తో పల్లవి రామిశెట్టి ఫేమస్ అయ్యింది. ‘రంగుల కల’ అనే షో ద్వారా బుల్లితెర పైకి అడుగుపెట్టింది పల్లవి. ఈ షో సక్సెస్ అయ్యేసరికి మరిన్ని ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. 'భార్యామణి', 'ఆడదే ఆధారం' సీరియల్స్ తో పల్లవి మరింతగా పాపులర్ అయ్యింది. 'భార్యామణి' సీరియల్ లో ఉత్తమ నటనకు గాను నంది అవార్డును కూడా గెలుచుకుంది పల్లవి. తర్వాత ‘మాటే మంత్రం’సీరియల్ లో వసుంధరగా తెలుగు ఆడియన్స్ ని అలరించింది. ప్రస్తుతం 'అత్తారింటికి దారేది', 'పాపే మా జీవన జ్యోతి' సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
ఈమె సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. అందుకే పల్లవికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ కూడా పెద్దగా తెలియవు. ఐతే ఇటీవల తన సీమంతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన వాళ్లంతా ఈ హడావుడిని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి పల్లవి గురించి తెలిసింది. ఇక బుల్లి తెర నటులు ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి కాబోతున్న పల్లవికి నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. పల్లవి 2019 మే 23న దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
Also Read