బ్యాంక్లో తిలోత్తమకు నయని ఇచ్చిన షాక్ ఇదే!
on Jul 6, 2022
బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతోన్న సీరియల్స్లో 'త్రినయని' ఒకటి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ఈ సీరియల్ని రూపొందించారు. జరగబోయేది ముందే తెలిసే వరం వున్న ఓ యువతి తన భర్త తల్లి హత్య వెనకున్న రహస్యాన్ని ఎలా ఛేధించింది? అనే ఆసక్తికరమైన కథతో ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తోంది. ఆసక్తికర మలుపులు, ట్విస్ట్ లతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీసత్య, భావనా రెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు తదితరులు నటించారు. కసి కారణంగా ఫ్యాక్టరీ నానాటికీ నష్టాల్లో కూరుకుపోతూ వుంటుంది. ఇది తిలోత్తమకు ఇబ్బందికరంగా మారుతుంది. చివరికి అకౌంట్ నుంచి డబ్బులు తీయడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇదే విషయాన్ని హాసిని హెచ్చరిస్తుంది. కసిని నమ్ముకుంటే అంతా మసే అని చెబుతుంది. ఇదే సమయంలో నయని, విశాల్ సొంతంగా వ్యాపారం చేయబోతున్నారని, బ్యాంక్ లోన్కి అప్లై చేయబోతున్నారని తెలియడంతో తిలోత్తమ, కసి, వల్లభ ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి వెళతారు.
అదే సమయంలో నయని, విశాల్ బ్యాంకులో మేనేజర్ తో మాట్లాడుతుంటారు. కరెక్ట్ టైమ్కే వచ్చామని వెటకారాలు పోయిన కసి.. విశాల్కుకు గాయత్రీదేవి ఇండస్ట్రీస్కు ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. తిలోత్తమ కూడా వంత పాడుతుంది. దీంతో నయని - విశాల్ తమకు పుండరీనాథం తాత వల్ల లభించిన పెట్టెని లోనికి తీసుకురమ్మంటారు. అది ఇక్కడికి ఎందుకని తిలోత్తమ అంటుంది. చెప్తా అని విశాల్ "అమ్మ.. నువ్వే ఈ పెట్టెని ఓపెన్ చేయి" అంటాడు. తెరిచి చూసిన తిలోత్తమ అందులో బంగారు ఆభరణాలు, వజ్రాలు వుండటంతో ఒక్కసారిగా షాకవుతుంది. కసి, వల్లభ పరిస్థితీ అంతే. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read