వేదని స్టేషన్ లో అడ్డంగా బుక్ చేసిన కైలాష్!
on Jul 6, 2022
నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటిస్తున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతీ రోజు రాత్రి 9:30 గంటలకు స్టార్ మాలో ప్రసారం అవుతోంది. చిత్ర విచిత్రమైన మలుపులతో, ట్విస్ట్ లతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, రాజా శ్రీధర్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.
వేదని బలవంతం చేయాలని నిర్ణయించుకున్న కైలాష్ అదను చూసి అందరిని సినిమాకు పంపించేసి తనపై దాడికి పూనుకుంటాడు. కైలాష్ చెడు బుద్ధి గమనించిన వేద అతని నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా కైలాష్ తనకు ఛాన్స్ ఇవ్వకుండా వెంటపడతాడు. ఈ క్రమంలో తనని కొడతాడు కూడా.. కిందపడిన వేదపైకి వెళ్లే ప్రయత్నం చేయడంతో అదే సమయంలో వేదకు ఓ కర్ర దొరుకుతుంది.. కట్ చేస్తే.. వేద పోలీస్టేషన్ లోని సెల్లో బందీగా వుంటుంది. ముంబై నుంచి ఇంటికి తిరిగి వచ్చిన యష్.. వేద కోసం ఇళ్లంతా వెతుకుతుంటాడు. తల్లి మాలిని, తండ్రిని అడిగితే సమాధానం వుండదు. అభిమన్యు చెప్పుడు మాటలకు యష్ పై అంతా గుర్రుగా వుంటారు.
విషయం తెలుసుకున్న యష్ అసలు జరిగింది ఇది అని వివరించడంతో అంతా కూల్ అయిపోతారు. అయితే వేద ఎక్కడ అంటే ఎవరి దగ్గరా సమాధానం వుండదు.. దీంతో పోలీస్టేషన్ లో మిస్సింగ్ కేస్ ఫైల్ చేయడానికి వెళతాడు. అక్కడ ఎస్సైతో వాదన అనంతరం వేద అక్కడే సెల్ లో వుందని తెలిసి షాక్ అవుతాడు. ఈ విషయం తెలియక యష్ తల్లి, తండ్రి ఫీలవుతుంటే కైలాష్ మాత్రం తను ఇక ఇంటికి రాదని, తన లైఫ్ ఫినిష్ అని తనలో తానే అనుకుంటూ వుంటాడు. స్టేషన్ లో ఎందుకున్నావని, ఏం జరిగిందని వేదని ఎంత అడిగినా సమాధానం చెప్పదు. వేద అసిస్టెంట్ నే అడ్డుపెట్టుకుని కైలాష్ గేమ్ ప్లాన్ చేసి తనని ఇరికించాడని చెప్పలేకపోతుంది. ఇంతకీ వేద బయటికి వచ్చిందా? కైలాష్ విషయం చెప్పిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read