సౌందర్యకు చేతిమీది పచ్చబొట్టు చూపించిన జ్వాల.. దాని కథేమిటి?
on Jul 6, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ విశేషాలేంటో తెలుసుకుందాం. జ్వాల తనని కొట్టినట్టు.. ఆనందరావు, సౌందర్యలతో వెటకారంగా మాట్లాడినట్టుగా హిమ ఊహించుకుంటుంది. కట్ చేస్తే.. జ్వాలకు హిమ శాలువా కప్పి అవార్డుని అందజేస్తుంది. ఆ వెంటనే "నమస్తే డాక్టర్ హిమగారు" అంటూ తనతో వెటకారంగా మాట్లాడుతుంది.
ఆ తరువాత ఆనందరావు, సౌందర్యల గురించి మాట్లాడుతూ "అందరికి నమస్కారం.. సౌందర్య, ఆనందరావులకు పెద్ద నమస్కారం" అంటుంది. ఆ తరువాత హిమ గురించి మాట్లాడుతూ "మీరు ఎంతో మంది ప్రాణాలు కాపాడి వుంటారు కదా, మీకు మహా నమస్కారాలు" అంటుంది. దీంతో ఆ మాటలకు హిమ ఎమోషనల్ అవుతుంది. "మీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను" అంటుంది. ఆ మాటలకు సౌందర్య, ఆనందరావు బాధపడుతూ వుంటారు.
అవార్డ్ ఫంక్షన్ పూర్తయ్యాక ఆనందరావు, సౌందర్య తన నానమ్మ, తాతయ్య అనే విషయాన్ని జ్వాల బయట పెడుతుంది. నేనే మీ మనవరాలు శౌర్య అని తెలిసి కూడా పరాయిదాన్ని చూసినట్టుగా చూశారని నిలదీస్తుంది. "మా విషయం పక్కన పెట్టు నువ్వు కూడా అలాగే ఎందుకు ప్రవర్తించావు?" అని అనడంతో వెంటనే తన చేతిపై వున్న పచ్చ బొట్టుని చూపిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.