శివయ్య మీద ఒట్టు...సెకండ్ షోకి వెళదామా
on May 29, 2025
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ రాబోయే ఆదివారం ప్రోమో ఫుల్ జోష్ తో నిండిపోయి కనిపించింది. ఈ షోకి "భైరవం" మూవీ టీమ్ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, డైరెక్టర్ విజయ్ కనకమేడల, నిర్మాత రాధా మోహన్ వచ్చారు. ఈ మూవీ ప్రొమోషన్స్ కోసం రావడం ఏమో కానీ మంచు మనోజ్ వన్ మ్యాన్ ఎపిసోడ్ లా ఉండబోతోందా అని ఈ ప్రోమో చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంత జోష్ తో మనోజ్ ఫుల్ కామెడీని పంచాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ స్టేజి మీదకు రాగానే శ్రీముఖి ఐతే "హార్టీ వెల్కమ్ టు యు" అంది "లివర్ వెల్కమ్ టు యు" అంటూ మనోజ్ పంచ్ డైలాగ్ వేసేశాడు. అందరూ నవ్వారు.
తర్వాత జైల్లో ఉన్న శ్రీసత్యని చూసాడు. "పాపం ఆవిడ పరిస్థితి ఏమిటిప్పుడు" అని అడిగాడు. "ఆవిడ రెండు రోజుల నుంచి జైల్లోనే ఉందండి" అని చెప్పింది శ్రీముఖి. "పాపం ఒక్కతే ఉందిగా నేను కంపెనీ ఇస్తాను డోర్స్ తియ్యండి" అంటూ కౌంటర్ వేసాడు. తర్వాత ప్రొడ్యూసర్ రాధ మోహన్ ఐతే రౌడీ రోహిణితో డ్యూయెట్ డాన్సులు వేసి అందరినీ అలరించాడు. ఇక డైరెక్టర్ విజయ్ వచ్చి "ఇంతవరకు దిల్ రాజు గారికి పోటీ లేదనుకున్నాం కానీ మా ప్రొడ్యూసర్ రాధామోహన్ అంతకు మించి మంచి పోటీ ఇస్తున్నారు" అంటూ కౌంటర్ వేసాడు. తర్వాత "అనసూయ గారు భైరవం గురించి మీ మాటల్లో" అని శ్రీముఖి అడిగింది. అనసూయ చెప్పబోయేంతలోనే కామెడీగా మంచు మనోజ్ "టాక్ యా" అంటూ కామెడీ చేసాడు. "నేను ఇంకా సినిమా చూడలేదు...శ్రీనివాస్ గారు మీరు" అని అనసూయ అనేంతలా "సెకండ్ షోకి వెళదామా " అంటూ మనోజ్ మళ్ళీ ఆవిడని మాట్లాడనివ్వకుండా కామెడీ చేసాడు. "మీరు వర్క్ చేసిన ఇంతమంది డైరెక్టర్స్ లో మై ఫ్రెండ్ అనిపించే డైరెక్టర్ ఎవరు..విజయ్ గారు ఉన్నారు కదా అని విజయ్ గారు ఉన్నారు కదా అని ఆయన పేరు చెప్పొద్దూ" అంది. వెంటనే మనోజ్ మాత్రం విజయ్ వైపు వేలు చూపించాడు. "ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నా" అన్నాడు మనోజ్. ఇలా ఈ వారం మనోజ్ ఈ షోలో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
