మలేసియాలో ఆర్య, అనును వెంటాడిన గ్యాంగ్!
on Jul 6, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీనియల్ `ప్రేమ ఎంత మధురం`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ఆత్యంతం ఆసక్తికర మలుపులతో ఈ సీరియల్ని రూపొందించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతున్న ఈ సీరియల్ ట్విస్ట్ లు, మలుపులతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె జంటగా నటించారు. ఇతర పాత్రల్లో జయలలిత, బెంగళూరు పద్మ, రామ్జగన్, జ్యోతిరెడ్డి, విశ్వమోహన్, రాధాకృష్ణ, కరణ్, అనుషా సంతోష్, సందీప్, మధుశ్రీ తదితరులు నటించారు.
రాగసుధ తప్పు బయటపడటంతో తను జైలుకి వెళుతుంది. ఇన్నాళ్లూ ఆఫీసు, కోర్టు కొడవలతో గడిపిన ఆర్య, అను మలేసియాకు వెకేషన్ కి వెళ్లాలని ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఈ విషయం తెలిసి మాన్సీ తను కూడా వస్తానని గొడవ చేస్తుంది. కడుపుతో వున్న వాళ్లు ప్రయాణం చేయకూడదని చెప్పడంతో తాను కడుపుతో లేనని సీరియస్ గా చెప్పినా ఆర్యవర్థన్, అతని తల్లి అర్థం చేసుకోరు. తను ఆవేశంగా చెబుతోందని భావిస్తారు. మాన్సీని వారిస్తారు.
ఇక మాన్సీ ఇలా కావడానికి కారణం ఆమె తల్లి షీలా అని ఆర్య తల్లి, నీరజ్ ఓ నిర్ణయానికి వచ్చి తనని ఇంటి నుంచి పంపించేయాలని ఆర్యతో చెబుతారు. ఈ విషయం విన్న అను, చాటుగా విన్న మాన్సీ కంగారు పడతారు. అయినా సరే తనని ఇంటి నుంచి పంపించేయాల్సిందేనని ఆర్య కూడా చెప్పడంతో మాన్సీ మరింతగా భయపడుతుంది. అయితే తనకు సపోర్ట్ చేస్తే తనతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారని, తనకు అస్సలు సపోర్ట్ చేయకూడదని మాన్సీ నిర్ణయించుకుంటుంది.
ఇంతలో షీలా పక్కా ప్లాన్ ప్రకారం దుర్గమాల ధరించానని అబద్ధం చెప్పి కాషాయం చీరలో దర్శనమిచ్చి షాకిస్తుంది. ఆమెలో ఈ మార్పుని చూసి ఆర్య తల్లి తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. కట్ చేస్తే జెండే ఫ్లైట్ టికెట్స్ తీసుకురావడంతో అను - ఆర్య మలేసియా బయలుదేరతారు.. ఎయిర్ పోర్ట్ లో దిగాక వీళ్లని రిసీవ్ చేసుకున్న ఓ వ్యక్తితో అక్కడి నుంచి కారులో బయలు దేరతారు. వీళ్లని ఓ గ్యాంగ్ వెంటాడటం మొదలు పెడుతుంది. అను - ఆర్యపై దాడికి ప్రయత్నించింది ఎవరు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read