హైపర్ ఆదికి గుండు కొట్టేసిన తోటి కమెడియన్స్
on Nov 28, 2022
హైపర్ ఆదికి శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ఘోర అవమానం జరిగింది. ఆయనతో పాటు ఉండే మిగతా కమెడియన్స్ అంతా కలిసి ఆదికి గుండు కొట్టారు. ఇది చూస్తున్న చూసిన ఆడియన్స్ అంతా షాకయ్యారు. ఐతే ఆదికి వీళ్లంతా కలిసి ఎందుకు ఇలా చేశారు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఐతే ఆది మాత్రం రెగ్యులర్ గా ఒక కాంట్రవర్సీ స్క్రిప్ట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఫేమస్ అయ్యాడు. ఇక లాస్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో థంబ్ నెయిల్స్ తో కాంట్రోవర్సి క్రియేట్ చేసాడు. ఇక ఇప్పుడు గుండు కొట్టించుకుని షాకిచ్చాడు. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో "చదివింపులు" అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు కమెడియన్స్. ఇక ఇందులో భాగంగా ఒక టాస్క్ కూడా ఇచ్చారు. నంబర్స్ చార్ట్ చూపించి అందులో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నంబర్ వెనక ఏముంటే అది చేయాలి అని యాంకర్ రష్మీ చెప్పింది. ఇందులో భాగంగా ఆది… నంబర్ 11 ని సెలెక్ట్ చేసుకున్నాడు. వెనక్కి తిప్పి చూస్తే దాని మీద ‘గుండు కొట్టించుకోవాలి’ అని రాసి ఉంది. అంతే మిగతా కమెడియన్స్ అందరూ ఆదికి గుండు కొట్టించాల్సిందేనని పట్టుబట్టారు. ఇక అలా అందరూ కలిసి ఆదికి గుండు కొట్టినట్లుగా ఉన్న ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. ఐతే ఈ ప్రోమోలో చూపించింది నిజంగా ఆది గుండా, లేదా ఇంకా ఎవరైనా ఆర్టిస్ట్ గుండా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
Also Read