Guppedantha Manasu : రాజీవ్ బ్రతికే ఉన్నాడా.. సూపర్ ట్విస్ట్!
on May 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1065 లో.....అనుపమ దగ్గరికి ఎందుకు వెళ్ళావంటు దేవాయనిపై ఫణింద్ర కోప్పడతాడు. అసలు నేనేం తప్పు చేశానంటూ దేవయాని అనగానే.. శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తాడు ఫణింద్ర. నన్నెందుకు కొట్టారు డాడ్ అంటూ శైలేంద్ర అడుగుతాడు.. ఈ దెబ్బ మీ అమ్మకి తాకాల్సింది కానీ ఆడవాళ్లపై చెయ్ చేసుకొనే అలవాటు నాకు లేదని ఫణింద్ర అనగానే.. తల్లీకొడుకులిద్దరు భయపడతారు.
ఆ తర్వాత ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళు బాధపడేలా మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ ఫణింద్ర వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు మహేంద్ర, వసుధారలు స్టేషన్ బయట కూర్చొని ఉంటారు. అప్పుడే రాజీవ్ స్టేషన్ లోపలికి వెళ్లి మనుని టీ తీసుకొమని అంటాడు. మను వెనక్కి తిరిగి ఉండి వద్దు అంటాడు అయిన విసిగిస్తుంటే వద్దని చెప్పాను కదా అంటూ ముందువైపు తిరిగేసరికి రాజీవ్ ఉంటాడు. అతన్ని చూసి మను షాక్ అవుతాడు.. రాజీవ్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. రాజీవ్ వచ్చాడంటు మను అరుస్తుంటాడు. మహేంద్ర, వసుధార, ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి.. ఏమైందని అనగానే రాజీవ్ వచ్చాడని చెప్తాడు.. చనిపోయిన వాడు ఎలా వస్తాడంటూ.. రాజీవ్ వచ్చాడంటే ఎవరు మను మాటలు నమ్మరు. మాకు ఎప్పుడు తీసుకొచ్చే అతనే టీ తీసుకొని వచ్చాడంటూ అతనిని పిలిపించి ఇందాక టీ తీసుకొని వచ్చింది నువ్వేనా అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. నేనే తీసుకొని వచ్చానని అతను చెప్తాడు.
ఆ తర్వాత వసుధార, మహేంద్ర ఇద్దరు కాలేజీకి వెళ్లి మను గురించి మాట్లాడుకుంటారు. శైలేంద్రకి ఏం తెలియదు అనుకుంటున్నారు కానీ తన హస్తం కూడా ఉందనిపిస్తుందని వసుధార అంటుంది.. ఉంటుంది ఎందుకంటే ఒక్కరితో అయ్యే పని కాదని మహేంద్ర అంటాడు. మా రాజీవ్ బావ బ్రతికే ఉన్నాడు.. నిన్న ఇంటికి వచ్చింది అతనే.. స్టేషన్ దగ్గర కన్పించాడు అని చెప్తే ఎవరు నమ్మలేదని వసుధార అంటుంది. ఎలాగైనా ఆ రాజీవ్ ని పట్టుకోవాలని మహేంద్ర అంటాడు. మరొకవైపు మను విషయంలో చేసిన ప్లాన్ గురించి రాజీవ్ గుర్తుకుచేసుకుంటాడు. శైలేంద్ర, రాజీవ్ లు కావాలనే ప్లాన్ చేసి మనుని కేసులో ఇరికిస్తారు. కాసేపటికి శైలేంద్ర, రాజీవ్ లు కలిసి మాట్లాడుకుంటారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read