ఢీ కంటెస్టెంట్ల బాగోతాలు.. వీడియోలు బయటపెట్టిన ప్రదీప్!
on May 7, 2021
బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ వచ్చే షోలలో 'ఢీ' ఒకటి. ఈ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న చాలా మంది టాప్ కొరియోగ్రాఫర్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పటిలా షో ఉండడం లేదని.. డాన్స్ కరువైందని విమర్శలు చేస్తున్నారు. 'ఢీ' షోలో బయట కనిపించేది వేరు.. లోపల జరిగేది వేరు అంటూ రాకేష్ మాస్టర్ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
'ఢీ' కంటెస్టెంట్లందరూ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారని.. క్రమశిక్షణతో ఉండరని రాకేష్ మాస్టర్ అన్నారు. జడ్జిలు, యాంకర్లు కూడా అంతేనని అన్నారు. మనకు కనిపించే షో అంతా కూడా ఎడిట్ చేసిన వర్షెన్ అని.. కానీ సెట్స్లో కంటెస్టెంట్లు, యాంకర్లు, జడ్జిలు చేసే హల్చల్ అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చారు తాజాగా అందులో కొన్ని విషయాలను యాంకర్ ప్రదీప్ బయటపెట్టాడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో అందరూ రీల్స్ వీడియోలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలానే 'ఢీ' కంటెస్టెంట్లు షూటింగ్ గ్యాప్ లో రీల్ వీడియోలతో రచ్చ చేస్తున్నారని.. కొన్ని వీడియోలు చూపించాడు ప్రదీప్.
ఓ వీడియోలో మణికంఠ, నైనికలు చేసిన ముద్దు సీన్ చూసి అందరూ షాకయ్యారు. ఇక ఈ వీడియోపై వచ్చిన మీమ్స్ చూసి అందరూ నవ్వుకున్నారు. 'జాతిరత్నాలు' సినిమాలో "చిట్టి" సాంగ్కి మణికంఠ, నైనిక డాన్స్ చేస్తుంటే.. అది చూసిన జిత్తు మాస్టర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్పై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు. ఇక ప్రసాద్, నైనిక చేసిన రొమాంటిక్ డాన్స్ వీడియోపై అభి మాస్టర్ కుమిలి కుమిలి ఏడ్చినట్టు చూపించారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది!
Also Read