ENGLISH | TELUGU  
Home  » TV News

శృతి మించిన రోహిణి పెర్ఫార్మెన్స్...ఇబ్బంది పడిన ఆది సాయికుమార్

on Mar 17, 2023

ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్ ఫంక్షన్ కి ఆది సాయికుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఈవెంట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "చిరునవ్వే విసిరావే" అనే బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తుంటే ఆది స్టేజి మీదకు మెరిసిపోయే బ్లాక్ డ్రెస్ లో మెస్మోరైజ్ చేసేసాడు. ఫస్ట్ టైం ఆది బుల్లితెర మీద తన డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరి మైండ్స్ ని బ్లాంక్ చేసేసాడు. ఆయన వెనకే జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి లంగా వోణిలో ఎంట్రీ ఇచ్చేసింది. ఆది ఆమెను చూసి తలపట్టుకున్నాడు పాపం... "నేను ఎక్కడికి వెళ్లినా ఈవిడ వచ్చేస్తారు. ఎందుకో నాకు అర్ధం కావట్లేదు" అని ఆది చాలా ఫీల్ అయ్యాడు. రోహిణి మాత్రం అతని మాటలు పట్టించుకోలేదు తనను కాదు అన్నట్టుగా తన పని తాను చేసుకుపోయింది.

"అస్సలేం గుర్తుకు రాదు" అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ తన వోణి పల్లూని ఆది ముఖం మీదకు విసిరి అతన్ని కొట్టి మరీ డాన్స్ చేసింది. ఆది పరిస్థితి అతని ఫేస్ లో కనిపించేసింది... ఐతే రోహిణి పెర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం శృతి మించి మరీ చిరాకు తెప్పించేదిగా ఉంది. ఇంతలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి "ఇంతకు మీకు ఆమె బికినీలో కావాలా, శారీలో కావాలా" అని ఆదిని అడిగింది. "ఆల్రెడీ సౌందర్య గారు శారీతో చేసేసారు వి విల్ గో విత్ బికినీ" అని యమా స్టైల్ గా చెప్పేసింది రౌడీ రోహిణి. ఆ మాటకు ఆది తలదించుకోక తప్పలేదు. ఇక ఈ షో ఈ ఆదివారం జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.