కనకం గాలిమేడలు రుద్రాణి కూల్చనుందా!
on Feb 5, 2023

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్-11లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో కృష్ణమూర్తికి రాజ్ వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాన్ని అప్పు చెప్తుంది. మన స్థాయిలో సంబంధం చూసుకోవాలి కానీ గాల్లో మేడలు కట్టొద్దని కృష్ణమూర్తి అంటాడు. మనలాగే మన పిల్లలు బ్రతకడం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి మంచి జీవితం ఇస్తాను.. నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదని అంటుంది కనకం.
మన గురించి వాళ్ళకి చెప్పావా అని అడుగుతుంది కావ్య. "చెప్పలేదు.. ఎక్కడ మనం ధనవంతులం కాదని తెలిస్తే దగ్గరికి కూడా రానివ్వరని.. వాళ్ళకి మనం ధనవంతులం అనే చెప్పినా" అని అంటుంది కనకం. "ఒక వేళ మనం వాళ్ళ స్థాయి వాళ్ళం కాదని తెలిస్తే.. అక్క పరిస్థితి ఆలోచించావా" అని అడుగుతుంది కావ్య. అవన్నీ నేను చూసుకుంటా అంటూ.. "కొంపదీసి మనం పేదవాళ్ళమని చెప్పేలా ఉన్నావ్.. నువ్వు అలా చెప్తే నా మీద ఒట్టే" అని కనకం తన మీద ఒట్టేసుకుంటుంది. మరొక వైపు రాజ్ ఇంట్లో అందరు.. "నీ కలల స్వప్న సుందరి గురించి ఆలోచిస్తున్నావా" అంటూ రాజ్ ని ఆటపట్టిస్తారు. రాజ్ కి స్వప్న అంటే ఇష్టమని వాళ్ళ అమ్మకు చెప్పడంతో.. ఆమె హ్యాపీ గా ఫీల్ అవుతుంది. రుద్రాణి మాత్రం.. మీరందరు అనుకుంటున్నట్టు వాళ్ళు కోటీశ్వరులు కాదు. నేను అనుకున్నది జరగాలంటే ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని అనుకుంటుంది.
స్వప్న కావాలనే తన చెవి కమ్మ రాజ్ ఇంట్లో వదిలేసి ఆ వంక తో మళ్ళీ రెడీ అయి రాజ్ ఇంటికి వెళ్తుంది. అయితే స్వప్న ఫోన్ మర్చిపోవడం చూసిన కావ్య, అప్పులు.. "స్వప్న అక్కడ ఏమైనా ఇబ్బంది పడుతుందేమో" అని అనుకొని ఫోన్ స్వప్నకి ఇవ్వాలని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



