ENGLISH | TELUGU  
Home  » TV News

గోదావరి పార్ట్ 2.. సుమంత్ కథ అదిరిపోయింది...

on May 25, 2025

 

ఆహాలో కాకమ్మ కథలు ఈ వీక్ ఎపిసోడ్ మస్త్ ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి "అనగనగా" మూవీ టీమ్ నుంచి హీరో సుమంత్ కుమార్, స్కూల్ ప్రిన్సిపాల్ గా చేసిన అవసరాల శ్రీనివాస్ వచ్చారు. ఇక హోస్ట్ తేజస్విని మడివాడ ఇంట్రావర్ట్స్ గా కాకుండా తన షోలో తిక్కతిక్క సమాధానాలు చెప్పాలి అంటూ ప్రమాణం చేయించింది. "మినిమం డిగ్రీ ఉండాలి" అనే సెగ్మెంట్ లో ఇద్దరికీ చెరొక ఐదు పదాలు ఇచ్చి దాంతో ఒక స్టోరీ క్రియేట్ చేయమని టాస్క్ ఇచ్చింది. ఆ ఐదు పదాలు ఏమిటి అంటే " పున్నమి వెన్నెల్లో, గోదావరి, మళ్ళీ రావా, చక్కని చుక్క, ఏమో గుర్రం ఎగరావచ్చు" వంటివి ఇచ్చింది. 

 

దాంతో సుమంత్ కూడా ఒక ఇంటరెస్టింగ్ కథను అల్లేశాడు. అదేంటో తెలుసా "పున్నమి వెన్నెల్లో నాకు ఒక చక్కని చుక్క కనిపించింది. తను నా దగ్గరకు వచ్చి గోదావరి పార్ట్ 2 చేయొచ్చు కదా అని అడిగింది. సో నేను శేఖర్ కమ్ముల దగ్గరకు వెళ్లి మళ్ళీ రావా చేద్దాము అని అడిగాను...ఏమో గుర్రం ఎగరావచ్చు అని చెప్పారు" అని సుమంత్ చెప్పడంతో అవసరాల శ్రీనివాస్, తేజస్విని చప్పట్లు కొట్టారు. చాలా బాగా చెప్పారు అంటూ తేజు పొగిడేసరికి సుమంత్ కూడా థ్యాంక్యూ అని చెప్పాడు. గోదావరి పార్ట్ 2 చేయమంటూ చాలా మంది చక్కని చుక్కలే వచ్చి అడుగుతూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు ఫన్నీగా. 

 

సుమంత్ నటించిన "అనగనగా" మూవీ మాత్రం అద్దిరిపోయే రేటింగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో ఫాదర్ అంటే ఎలా ఉండాలి అనే పాయింట్ కి ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ఐతే సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ రీసెంట్ గా కొన్ని కామెంట్స్ వచ్చాయి కానీ వాటిని ఇగ్నోర్ చేయమని చెప్పాడు. సింగల్ గా ఉండడం ఇష్టం అని చెప్పాడు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.