శౌర్య గురించి నిజం తెలుసుకున్న సౌందర్య!
on Jun 22, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా విజయవంతంగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రోజు ఎపిసోడ్ ఎలా వుండబోతోందో ఇప్పడు చూద్దాం. హిమ గురించి స్వప్న మాట్లాడుతూ "చూశావా నిరుపమ్ పెళ్లి కాకముందే నన్ను బెదిరిస్తూ మాట్లాడుతోంది. పెళ్లైన తరువాత ఇంకా ఎలా మాట్లాడుతుందో ఏదైనా అందామంటే బాగాలేదన్న సానుభూతి ఒకటి" అనగానే `ఇక్కడ మీ సానుభూతిని ఎవరూ కోరుకోవడం లేదు అత్తయ్యగారు ` అని హిమ అంటుంది.. ఆ మాటలకు వెంటనే అంతా షాక్ అవుతారు.
దీంతో అక్కడి నుంచి నిరుపమ్, స్వప్న వెళ్లిపోతారు. వెంటనే సౌందర్య ..ఇదంతా ఎవరి కోసం అని హిమని నిలదీస్తూ "ఏం జరిగింది? ఏం జరుగుతోంది?" అని సీరియస్ అవుతుంది. "శౌర్య కోసం" అని చెప్పడం తో ఆనందరావు, సౌందర్య షాక్ అవుతారు. హిమ మాట్లాడుతూ "మీ దగ్గర ఓ విషయం దాచాను. శౌర్య ఎవరో ఎక్కడ వుందో నాకు తెలుసు" అంటుంది. ఆ మాటలు విన్న ఆనందరావు, సౌందర్య మళ్లీ షాక్ కు గురవుతారు. వెంటనే శౌర్యని చూపిస్తానని చెప్పి సౌందర్యని తీసుకుని హిమ బయటికి వెళుతుంది.
కట్ చేస్తే... అనాథాశ్రమంలో నిరుపమ్ కోసం శౌర్య ఎదురుచూస్తూ వుంటుంది. ఇంతలో నిరుపమ్ వస్తాడు. తను రావడంతో అతనిపై శౌర్య ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నా మనసులో నువ్వు లేవని, నేను తింగరి హిమని పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. దీంతో ఎమోషనల్ అయిన శౌర్య.. వెంటనే నిరుపమ్ కాలర్ పట్టుకుంటుంది. ఇదంతా చాటుగా చూస్తున్న సౌందర్య "అదేంటీ వీళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారు?" అంటుంది. వెంటనే తనే శౌర్య అని హిమ చెప్పడంతో సౌందర్య షాకవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? సౌందర్య ఎలా రియాక్ట్ అయింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read