ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటున్న కంటెస్టెంట్స్!
on Dec 10, 2022
బిగ్ బాస్ అన్ని సీజన్లలోనూ ఈ సీజన్-6 బోరింగ్ అనే మాట ప్రతీ వారం వినిపిస్తుంది. కానీ ఈ వారం బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా అలా అనరనే చెప్పాలి. ఎందుకంటే ప్రతీ కంటెస్టెంట్ తమ పర్ఫామెన్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు.
అయితే గత వారం నుండి జరుగుతున్న విన్నర్ ప్రైజ్ టాస్క్ లు అన్నీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. హౌస్ లో ఉన్న ఏడుగురు కూడా తమకిచ్చిన టాస్క్ లలో బాగా ఇన్వాల్వ్ అయ్యి, ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కీర్తి, సత్యని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. చీకటి గదిలో వాళ్ళకి భయాన్ని దగ్గర నుండి చూపించాడు బిగ్ బాస్. అయితే అలా భయపడటం చూసేవాళ్ళకి వినోదాన్ని పంచింది. ఇంకా లాస్ట్ లో బిగ్ బాస్, కంటెస్టెంట్స్ అందరినీ ఒకేసారి కన్ఫెషన్ రూంకి పిలవగా, అందరూ భయంతో గందరగోళం చేసారు. వీళ్ళందరి భయంతో కూడిన పర్ఫామెన్స్ వినోదాన్ని పంచింది. ఇంకా ఆ తర్వాత కంటెస్టెంట్స్ చేసిన రోల్ ప్లే టాస్క్ లో.. ఇప్పటివరకు హౌస్ లో జరిగిన గొడవలు, అందరికి గుర్తుండిపోయిన సంఘటనలు మళ్ళీ చేసి చూపించమన్నాడు బిగ్ బాస్. అయితే ఎవరి రోల్ వారికి ఇవ్వకుండ క్యారెక్టర్ మార్చి ఇవ్వగా, అందరూ కూడా బాగా చేసారు.
శ్రీహాన్, ఇనయాల మధ్యలో జరిగిన పిట్ట గొడవను.. అర్జున్ రేవంత్ మధ్యలో పప్పు గొడవను.. ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్.. ఇంకా రోహిత్, రేవంత్ ల గొడవ. వీటికి సంబంధించిన రోల్ ప్లే బాగా చేసారు. ఆ తర్వాత "కంటెస్టెంట్స్ రోల్ ప్లే బాగా చేసి నాకు వినోదాన్ని అందించారు" అంటూ బిగ్ బాస్ మెచ్చుకున్నాడు. ఆ తర్వాత విన్నింగ్ ప్రైజ్ మనీ అమౌంట్ 47 లక్షలుగా ఉందని అనడంతో కంటెస్టెంట్స్ అందరు సంతోషపడ్డారు. అయితే ఈ టాస్క్ లో రోహిత్, శ్రీసత్య బాగా పర్ఫామెన్స్ చేసారంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read