తాగిన మత్తులో కావ్య గదిలోకి వెళ్ళిన రాజ్.. అసలు నిజం తెలిసిపోయింది!
on Mar 31, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజు రోజుకి అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ టీఆర్పీ లో టాప్ -5 లో ఉంటుంది. కాగా గురువారం నాటి ఎపిసోడ్-57లో.. ఉదయం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో ఉంటారు. అప్పుడే కావ్య గది నుండి బయటకొస్తాడు రాజ్. అది చూసినవాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అసలు ఆ అమ్మాయంటేనే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ఏం చేసావ్? అసలు ఎందుకు వెళ్ళావ్? ఇలాంటి విషయం నేను అడగలేనని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రుద్రాణి ఏమైందని అడుగుతుంది. నాకేం తెలియదని రాజ్ అంటాడు. ఇప్పుడు నిజం చెప్పు అసలు ఏం జరిగిందని అడగగా.. అసలు ఆ కళావతి అంటేనే నాకిష్టం లేదని అంటాడు.
రాజ్ వాళ్ళ అమ్మమ్మ సంతోషిస్తుంది. రాజ్ వాళ్ళ అమ్మ బాధపడుతుంది. నాకేమీ గుర్తు రావడం లేదని రాజ్ చెప్తుండగా.. రాత్రి ఏం జరుగిందో నాకు తెలుసని కళ్యాణ్ అంటాడు. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. రాత్రి రాజ్ అన్నయ్య తాగేసి ఆ కావ్య గదిలోకి వెళ్తుండగా నేను ఆపాను.. రాజ్ అన్నయ్య మాత్రం నా భార్య గదిలోకి నేను వెళ్తా నీకెందుకని చెప్పి కావ్య ఉన్న గది తాళం తీసుకొని మరీ వెళ్ళాడని కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు. అందరూ రాజ్ తాగాడంటే ఆశ్చర్యపోతారు. రాజ్ నువ్వు తాగావా అని అపర్ణ అడగగా.. ఏమో గుర్తులేదని రాజ్ అంటాడు. దాంతో రాజ్ వాళ్ళ అమ్మ కోపంతో హాల్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి ఇంతకీ రాత్రి శోభనం జరిగిందా అని కళ్యాణ్ ని రుద్రాణి అడగగా... గది బయట వరకూ నాకు తెలుసు.. లోపల ఏం జరిగిందో తెలియదని చెప్పేసి వెళ్ళిపోతాడు.
కనకం వాళ్ళ అక్క ఇంటికి వచ్చి వెళ్తుంది. స్వప్న ఎక్కడికి వెళ్ళిందో తెలియదు.. ఇష్టం లేని పెళ్ళి చేసి కావ్య గొంతు కోసానని కనకం వాళ్ళ అక్కతో చెప్పుకుంటూ బాధపడుతుంది. వాళ్ళ అక్క ఓదారుస్తుంది. గుండె బరువెక్కింది.. కాసేపు ప్రశాంతంగా ఉందామని కనకం, వాళ్ళ అక్క కలిసి గుడికి వెళ్తారు. మరోవైపు రాజ్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని కావ్యనే డైరెక్ట్ గా అడుగుదామని వెళ్తాడు. కావ్య దగ్గరికి వెళ్ళాక తనతో ఏమీ మాట్లాడకుండా.. మనసులో మాట్లాడుకొని వెళ్ళిపోతుంటాడు.. హాలో రాజ్ గారు.. మీలో మీరే మాట్లాడుకొని వెళ్ళిపోతే నాకెలా తెలుస్తుందని అడగగా.. రాజ్ తడబడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
