Krishna Mukunda Murari: ఆత్మాభిమానంతో భవాని మనసు గెలుచుకున్న మీరా.. మురారిని దక్కించుకుంటుందా!
on Mar 28, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 429 లో.. మీరాను కలవడానికి భవాని వెళ్తుంది. అయితే ముకుంద అలియాస్ మీరా తన ప్లాన్ ప్రకారం.. బస్తీలో ఓ పేదింట్లో ఉంటున్నట్టుగా నటిస్తుంది. ముందు ఓ అనాథగా నటిస్తూ భవాని రాకకోసం ఎదురుచూస్తుంటుంది. భవాని అడ్రెస్ వెతుక్కుంటూ వెళ్లి.. ఓ బస్తీలో ఒక చోట ఆగుతుంది. కారు దిగి.. ఆ చుట్టూ చూసి.. ‘మీరా.. ముకుంద ఫ్రెండ్.. అలాగే హోమ్ మినిస్టర్ వాళ్ల అమ్మాయి ఫ్రెండ్ అన్నారు కదా.. ఇలాంటి బస్తీలు ఉంటుంది ఏంటని ఆలోచిస్తూనే.. ఆ చెత్త చెదారమంతా దాటుకుంటూ లోపలికి నడుస్తుంది. అలా వెళ్లగా వెళ్లగా ఓ చోట ముకుంద(మీరా) ఓ పాడుబడిన ఇంటి ముందు బట్టలు ఆరేసుకుంటూ ఉంటుంది. మీరాని వెనుక నుంచి చూసిన భవాని.. ఇక్కడ మీరా అంటే ఎవరమ్మా? అంటుంది. వచ్చారా అత్తయ్యా.. మీ రాకకోసమే నేను ఈ నాటకం స్టార్ట్ చేశానుని ముకుంద తన మనసులో అనుకుంటు వెనక్కి తిరిగి.. భవానీ దేవితో.. నేనేనండీ మీరెవరని అడుగుతుంది. నేను మురారీ వాళ్ల పెద్దమ్మని, నిన్న మా అబ్బాయిని కాపాడినందుకు చాలా థాంక్స్ అమ్మా అంటు మీరాతో భవాని అంటుంది. అయ్యో మీరా మేడమ్.. ఒక్క నిమిషం మేడమ్ అంటూ విరిగిన కుర్చీ ఆ పక్కనుంచి తెచ్చి భవాని ముందు వేసి.. తన చున్నీతో తుడిచి.. కూర్చోండి మేడమ్ అని మీరా అంటుంది. సారీ మేడమ్.. మీలాంటివాళ్లు ఇక్కడ కూర్చోవడం కాదు కదా నిలబడను కూడా కష్టమే. అందుకే నేనే వస్తానని చెప్పాను కదా.. మీరెందుకు వచ్చారని మీరా అంటుంది. అవసరం కోసం వెళ్లడం ఆలస్యం అయినా ఫర్వాలేదు కానీ.. అవసరానికి ఆదుకున్న వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆలస్యం కాకూడదు. అందుకే వచ్చాను. కానీ నీకు అంత గొప్పస్థాయిలో ఉన్న స్నేహితులు ఉంటే నువ్వేంటి ఇలాంటి చోట ఉంటున్నావని భవాని అడుగుతుంది.
గొప్ప స్నేహితులున్న మాట నిజమే కానీ.. వాళ్లకు సాయం చేసే స్థోమత ఉన్నా కానీ.. నాకు ఆత్మాభిమానం ఎక్కువ మేడమ్. అనాథనైన నన్ను ముకుంద చాలా ప్రేమగా చూసుకునేది. చాలాసార్లు తనతో పాటు వచ్చేయమని పిలిచింది. కానీ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇలా బతికేస్తున్నానంటు మీరా నటిస్తుంది. ఇక కరిగిపోయిన భవాని.. ఇప్పటి నుంచి నువ్వు మాతోనే ఉండబోతున్నావ్. నిన్ను ముకుందను చూసుకున్నట్లే చూసుకుంటాం.. పదా వెళ్దామని అనగానే.. వద్దని మీరా అంటుంది. రానని మాత్రం చెప్పొద్దు.నేను బాధపడతాను.. పోనీ ముకుంద మాటకైనా విలువిచ్చి నాతో రా అంటూ భవాని అడిగేసరికి.. మీరు ముకుంద అని అన్నారు కాబట్టి వస్తానండి అని మీరా అనడంతో ఇద్దరు వస్తుంటారు. దారిలో షాపింగ్ చేసి మూరాకి బట్టలు తీసుకుంటుంది భవాని. మరోవైపు శ్రీనివాస్ కోసం నలుగురు స్నేహితులు వస్తారు. ముకుంద చావుకు పలకరింపుగా వస్తారు. శ్రీనివాస్ చుట్టూ కూర్చుని సానుభూతి తెలుపుతారు. ఒక్కగానొక్క బిడ్డ గుండెను రాయి చేసుకుని బతకాలిరా శ్రీనివాస్ అంటాడు ఒకడు. గుండెను రాయి చేసుకోవడం కాదురా.. బతికే ఉన్న బిడ్డను పోయింది పోయింది అంటుంటే.. ప్రాణం పోతుంది నాకు అని శ్రీనివాస్ మనసులో అనుకుంటాడు. అదేదో మాములు చావు అయ్యి ఉంటే కాస్తనైనా తట్టుకునేవాడివి.. పాపం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ముఖం కూడా చిందరవందరైపోయిందట కదా అని మరొకడు అంటాడు. ఇక వాళ్ళ మాటలు భరించలేక.. ఇది ఇక్కడితో వదిలేయండ్రా అని శ్రీనివాస్ అంటాడు. అయిన వాళ్ళు వదలకపోవడంతో.. మీరంతా వెళ్ళిపోండి అని వారిమీద కోప్పడి అక్కడ నుండి పంపించేస్తాడు శ్రీనివాస్.
మరోవైపు గదిలో ఉన్న ఆదర్శ్ దగ్గరకు నందు వెళ్లి.. రేయ్ అన్నయ్యా, పెద్దమ్మ మీరాను ఇక్కడికి తీసుకుని రావడానికి వెళ్లింది. ఆమెను తీసుకొచ్చాక నువ్వేం గొడవకు దిగొద్దు. అందుకే ముందుగా వచ్చి చెబుతున్నాను సరేనా.. కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని నందు అంటుంది. అసలు నీకు పెళ్లి అయ్యాక ఇక్కడ పనేంటే, పుట్టింటి గొడవలు నీకెందుకు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో.. నీకు భర్త, అత్త మామ అంతా ఉన్నారు కదా.. పో ఇక్కడి నుంచి అంటూ నందు మీద ఆదర్శ్ కోప్పడుతుంటాడు. ఎందుకు తను ఈ ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ మురారి ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆదర్శ్ కోపంగా చూస్తాడు మురారి. ఇక తరువాయి భాగంలో ఎదురుగా ముకుంద ఫొటోకి దండ వేసి ఉండటం చూసిన మీరా రగిలిపోతుంది. వెంటనే అందరితో.. నా స్నేహితురాలు ముకుంద ఫొటోని అలా చూస్తుంటే.. ఆ యాక్సిడెంటే గుర్తొస్తోంది. వీలైతే ఆ ఫొటోకి ఉన్న దండతో పాటు ఫొటోని కూడా తీసేస్తారా అని మీరా అంటుంది. దాంతో అందరు షాకై తననే చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read